Wednesday, March 14, 2012

'తృణమూల్' రాజకీయం

నవ్వితే నాకేటి సిగ్గు అనుకున్నాడట ఎనకటికొకాయన. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్స్ నేతలు కూద అలాగే వ్యవహరిస్తున్నారు. బెంగాల్ లో జరిగే ప్రతి నేర ఘటనను నిస్సిగ్గుగా సిపిఎంకు ఆపాదించే ఆ పార్టీ ఇప్పుడు రైల్ చార్జీల పెంపును వేరే వాళ్లకు ఆపాదిస్తుంది. రైల్ చార్జీలు పెంచిన పెంపును ఉపసమ్హరిణ్చుకొవాలని, లేదంటే రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న తృణమూల్ సొంత పార్టీకి చేందిన మంత్రిని తామే తొలగించవచ్చుగా... కేవలం ప్రజలను మోసం చేయడానికి దొంగ ప్రకటనలు చేస్తుంది. ... ఇంకో విషయమేమంటే ఐసియు లో వున్న రైల్వే ను గాడిలోకి తెచ్చానని  రైల్వే మంత్రి పేర్కొన్నారు. అంటే గత రైల్వె మంత్రి మమత బెనర్జీ రైల్వేను ఐసియు కు చేర్చారని సొంత మంత్రే వక్యానించడం గమనించదగిన విషయం.